బావిలోని బురద నీళ్లే తాగుతున్న ప్రజలు

బావిలోని బురద నీళ్లే తాగుతున్న  ప్రజలు

తిర్యాణి, వెలుగు : ఆసిఫాభాద్​కొమ్రం భీం జిల్లా మండలంలోని గోవెన గ్రామపంచాయతీ పరిధిలోని కోలంగూడలో ప్రజలు బావిలోని బురద నీళ్లే తాగుతున్నారు. ఈ ఊరిలో సుమారు 50 మంది వరకు జనాభా ఉండగా నెల క్రితం వరకు కొంతమంది బోరు నీళ్లు తాగేవారు. అది చెడిపోవడంతో అందరూ ఈ బావిపైనే ఆధారపడ్డారు. మొన్నటి వర్షాలకు ఇందులోని నీళ్లన్నీ బురదమయమయ్యాయి. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నీటినే తాగడానికి ఉపయోగిస్తున్నారు. దీంతో వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు, పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు తమకు ఎందుకులే అనుకుని వదిలెయ్యడంతో ఈ పరిస్థితి నెలకొంది.