డీఎంకే సలహాదారుగా ప్రశాంత్ కిశోర్..!

డీఎంకే  సలహాదారుగా ప్రశాంత్ కిశోర్..!

చెన్నై:పోల్​ స్ట్రేటజిస్ట్ ​  ప్రశాంత్​ కిశోర్​(పీకే)   డీఎంకే  చీఫ్​ ఎంకే స్టాలిన్​ రాజకీయ సలహాదారునిగా చేరబోతున్నట్టు తెలుస్తోంది.   2021లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే  ముఖ్యమైన క్యాంపెయినర్​గా  పీకే ఉంటారని   పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఈమేరకు డీఎంకే, కిశోర్​ మధ్య చర్చలు ఫైనల్​ స్టేజ్లో ఉన్నట్టు సమాచారం. లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో  తమిళనాట  డీఎంకే దాదాపు క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసినా.. నాంగునేరి, విక్రవాండి  బై ఎలక్షన్లో  మాత్రం  ఆపార్టీ  బోల్తాపడింది.  దీనికితోడు అన్నాడీఎంకే బలం కూడా పుంజుకుంటోంది. దీంతో ఎలర్ట్​ అయిన డీఎంకే వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం  కొత్త వ్యూహాలతో ముందుకువెళ్తోందని  పొలిటికల్​ స్ట్రేటజిస్టులు అంచనా వేస్తున్నారు.యాక్టర్​ కమల్‌‌‌‌హాసన్‌‌‌‌  ఆధ్వర్యంలోని  మక్కల్‌‌‌‌ నీది మయ్యం (ఎంఎన్​ఎం) తో  పీకే చేసుకున్న కాంట్రాక్ట్​  ఈ ఏడాది జనవరితో పూర్తయింది.  అయితే ఈ కాంట్రాక్ట్​ మళ్లీ రెన్యూవల్​  చేసుకోలేదని ఎంఎన్​ఎం వర్గాలు చెప్పాయి.

పీకే ఆధ్వర్యంలో నడుస్తున్న  ఇండియన్​ పొలిటికల్​ యాక్షన్​ కమిటీ ( ఐ‌‌‌‌‌‌‌‌=పాక్​)తో తమిళనాడు ముఖ్యమంత్రి  ఈకే పళనిస్వామి ఈఏడాది మొదట్లో చర్చలు జరిపినా… అవి విజయవంతం కాలేదు. మరోవైపు..2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది.  జయలలిత, ఎం.కరుణానిధి లేకుండా జరగబోతున్న మొదటి ఎలక్షన్లు ఇవే. రాజకీయపార్టీ పెడుతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సూపర్​స్టార్​ రజనీకాంత్​ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే కలిసి పనిచేస్తామని స్టార్​ యాక్టర్లు రజనీకాంత్​, కమల్​హాసన్​ ఇద్దరూ ఈమధ్యనే ప్రకటించారు.

సాధించిన విజయాలు

2011లో నరేంద్రమోడీ గుజరాత్​ ముఖ్యమంత్రిగా మూడోసారి గెలవడంలో కీలకపాత్ర పోషించారు.2014లో  మోడీ, బీజేపీ ప్రచారానికి కొత్త టెక్నిక్​లు అందించారు.చాయ్​పే చర్చా క్యాంపెయిన్​, 3డీ సభలు, కాంక్లేవ్​లు, సోషల్​ మీడియా ప్రోగ్రామ్స్​ తయారుచేశారు.  బీహార్ లో నితీశ్​కుమార్​, పంజాబ్ లో  అమరీందర్​ సింగ్​, ఆంధ్రప్రదేశ్​లో జగన్మోహన్​ రెడ్డికి ప్రచారం చేశారు.ఈ నెలలో బెంగాల్​లో జరిగిన అసెంబ్లీ బైపోల్స్ లో  ఆయన తృణమూల్​కు వ్యూహకర్తగా ఉన్నా రు. 3 సీట్లను  మమతా గెలుచుకున్నారు.