
జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్ పల్లి మండలం బండలింగాపూర్ హైవేపై ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనక నుంచి ఢీకొని బస్సు నుజ్జు నుజ్జయ్యింది.. బుధవారం ( జూన్ 4 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఇబ్రాహింపట్నం మండలం రాజేశ్వర్రావుపేట నుండి మెట్పల్లి వైపు ఇటుక లోడుతో వస్తున్న ట్రాక్టర్ ను వెనుక నుండి బలంగా ఢీ కొట్టిన నిజామాబాద్ డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు.
బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడగా.. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జయ్యింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ కాలుకు తీవ్రమైన గాయం అయ్యింది. డ్రైవర్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో ప్రమాదం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్తో పాటు ఓ ప్రయాణికురాలు మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బస్ బ్రేక్ డౌన్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో బస్ ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు మొదలుపెట్టినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.