
టాటా,స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ తండ్రి ఎరల్ మస్క్ యూపీలోని అయోధ్యను సందర్శించారు. జూన్ 1నుంచి ఇండియా పర్యటనలో ఉన్న ఆయన జూన్ 4న బుధవారం అయోధ్యలోని బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో హనుమాన్ గార్హీ టెంపుల్ ను కూడా సందర్శించారు. ఎరల్ మస్క్ వెంట ఆయన కుమార్తె అలెగ్జాండ్ర మస్క్ కూడా ఉన్నారు. రామాలయ సందర్శన సమయంలో ఆయన సాంప్రదాయ భారతీయ దుస్తులు - కుర్తా-పైజామా - ధరించారు. ఎరల్ మస్క్ రాకతో ఆలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు .
ఈ సందర్బంగా రామాలయం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. తాను ఇప్పటిదాకా చేసిన అత్యుత్తమ పనుల్లో ఈ ఆలయం సందర్శించడం ఒక్కటని అన్నారు. ప్రపంచలోనే ఇదొక అద్భుతమైన ప్రదేశమని చెప్పారు. ఇదొక అద్భుత ఆలయం అవుతుందని చెప్పారు. వీలైనంత ఎక్కువ మంది భారత్ కు రావాలన్నారు. ఇక్కడి ప్రజలు ఎంతో ప్రేమ,దయతో ఉంటారని అన్నారు. భారత్,అమెరికా సంబంధాలు బాగుంటాయన్నారు.
జూన్ 5 వరకు ఎరల్ మస్క్ ఇండియాలోనే పర్యటించనున్నారు. ఎర్రోల్ మస్క్ సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్ లిమిటెడ్కు గ్లోబల్ అడ్వైజర్. భారతదేశానికి చెందిన సంస్థతో పనిచేయడానికి ఇక్కడకు వచ్చారు.
►ALSO READ | కుంభమేళాలో 50, 60 మంది చనిపోతే మేం రాజకీయం చేశామా..? : బీజేపీకి సీఎం సిద్ధ రామయ్య కౌంటర్
మరో వైపు ఇవాళ(జూన్ 5న) అయోధ్య రామాలయం మొదటి అంతస్థులో రామదర్బార్ప్రాణ ప్రతిష్ట జరిగింది. యూపీ సీఎం యోగి ఆదిత్యానాత్ ప్రత్యేక పూజలు చేశారు. రామాలయంలోని మొదటి అంతస్తులో రామ దర్బార్ విగ్రహాలకు (రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు) ప్రాణ ప్రతిష్ఠతో పాటు మరో ఏడు దేవాలయాలలో విగ్రహాల ప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రాణ ప్రతిష్ఠ ఆచారాన్ని చందౌలి జిల్లాకు చెందిన ప్రసిద్ధ పండిట్ జైప్రకాష్ నేతృత్వంలో 101 మంది వేద ఆచార్యులు నిర్వహించారు