
బెంగళూరు సిటీలో ఐపీఎల్ కప్ విన్నర్ ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట పొలిటికల్ వార్ గా మారింది. బీజేపీ పార్టీ కాంగ్రెస్ ను టార్గెట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ధీటుగా స్పందిస్తుంది. సీఎం సిద్ధరామయ్య చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.. సీఎం సిద్ధరామయ్య కామెంట్లు బీజేపీ పార్టీని ఇరుకున పెడుతున్నాయి..
తొక్కిసలాటలో 11 మంది చనిపోవటం బాధాకరమే.. వాళ్ల కుటుంబాలను ఆదుకుంటాం.. ఇది జరగాల్సిన ఘటన కాదన్న సీఎం సిద్ధరామయ్య.. కుంభమేళా 50,. 60 మంది భక్తులు చనిపోతే.. కనీసం ఎంత మంది చనిపోయారో కూడా చెప్పలేదు.. కనీసం విజువల్స్ కూడా చూపించలేదు.. అయినా మేం ఏమైనా బీజేపీని విమర్శించామా.. రాజకీయం చేశామా అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దీంతో కర్ణాటక బీజేపీ షాక్ అయ్యింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రమాదాలు, తొక్కిసలాటలు, దుర్మార్గాలను ఎత్తిచూపుతూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలతో బీజేపీ కక్కలేక మింగలేని పరిస్థితుల్లో పడింది.
బెంగళూరు తొక్కిసలాటకు కుంభమేళాతో పోల్చుతూ సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.. ఇలాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగాయని... వాటిని పోల్చి, చెప్పడం ద్వారా నేను దానిని సమర్థించబోనని.. కుంభమేళాలో 50-60 మంది మరణించిన్నప్పుడు తాను విమర్శించలేదని అన్నారు. కాంగ్రెస్ విమర్శిస్తే విమర్శించి ఉండచ్చు కానీ.. తాను, కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడైనా విమర్శించామా అంటూ ప్రశ్నించారు సిద్దరామయ్య.
RCB విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాట రాజకీయ దుమారం రేపుతోంది. తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. లక్షలాది మంది అభిమానులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.. స్టేడియం కెపాసిటీ 35 వేలు మాత్రమే ఉండటం,పెద్దఎత్తున వచ్చిన అభిమానులను కంట్రోల్ చేయడంలో భద్రతా సిబ్బంది ఫెయిల్ అవడమే తొక్కిసలాటకు కారణమని తెలుస్తోంది.