ఇండోర్ జంట మిస్సింగ్ మిస్టరీ: పోలీసులు దర్యాప్తులో కీలక ఆధారాలు..

ఇండోర్ జంట మిస్సింగ్ మిస్టరీ: పోలీసులు దర్యాప్తులో కీలక ఆధారాలు..

మే 23న మేఘాలయలో హనీమూన్ వెళ్లిన సోనమ్ రఘువంశీ అదృశ్యమవ్వడం కలకలం రేపింది.. సోనమ్ కోసం సోహ్రా ప్రాంతం అంతా ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులకు కీలక ఆధారం దొరికినట్లు తెలిపారు. సోనమ్ కోసం గాలిస్తున్న తమ బృందానికి బుధవారం ( జూన్ 5 ) ఒక రెయిన్ కోట్ దొరికినట్లు తెలిపారు పోలీసులు.పోలీసులకు రెయిన్ కోట్ తడిసిపోయి ఉందని.. దానిపై రక్తపు మరకలు ఉన్నాయని తెలిపారు పోలీసులు. తమకు దొరికిన రెయిన్ కోట్ అదృశ్యమైన సోనమ్ రఘువంశీది అయ్యుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. 

సోహ్రాలోని మావ్క్మా రోడ్ సమీపంలో దొరికిన ఆ రెయిన్ కోట్ ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపినట్లు తెలిపారు పోలీసులు. రెయిన్ కోట్ పై ఉన్నవి రక్తపు మరకలా కాదా అన్నది ఫోరెన్సిక్ పరీక్షలు మాత్రమే తేలుతుందని తెలిపారు పోలీసులు. తమకు దొరికిన XXXL సైజు  రెయిన్ కోటు సోనమ్ కి చెందినదేనా అన్నది సీసీటీవీ ఫుటేజి ఆధారంగా పరిశీలిస్తున్నామని అన్నారు. 

వీ సాడాంగ్ ప్రాంతంలో దట్టమైన చెట్లు,పొదలు విస్తరించి ఉండటంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయని తెలిపారు పోలీసులు. భారీ వర్షం కారణంగా గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని అన్నారు. డ్రోన్లను మోహరించినప్పటికీ వాతావరణం సరిగా లేకపోవడం వల్ల గాలింపు ఆలస్యం అవుతోందని తెలిపారు పోలీసులు. డ్రోన్ సాయంతోనే సోనమ్ భర్త రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించటం గమనార్హం.