రాష్ట్రంలోకి కరోనా కొత్త వేరియంట్!

రాష్ట్రంలోకి కరోనా కొత్త వేరియంట్!

రాష్ట్రంలో కరోనా కొత్త వేరియెంట్ కేసు నమోదైంది. తాజాగా ప్రమాదకరమైన ఒమిక్రాన్ XBB.1.5 వేరియంట్ కేసు వెలుగులోకి వచ్చింది. దేశంలో గురువారం ఒక్కరోజే 8మందికి కొత్త వేరియంట్ సోకింది. చైనాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్త వేరింయెంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో, కరోనాను కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 60 యాక్టివ్ కేసులున్నాయి. అయితే ఈ వేరియంట్ కు భయపడాల్సిన పని లేదని, 99.5 శాతం రికవరీ రేట్ ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.  

దేశంలో మొదటి ఒమిక్రాన్ XBB.1.5 కేసు గుజరాత్ తో నమోదయింది. తర్వాత తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు గుజరాత్ లో 3, కర్ణాటక, రాజస్థాన్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఈ వేరియంట్ తో చైనా, యూఎస్ ఏ లో కేసుల సంఖ్య పెరుగుతుంది. ఒమిక్రాన్ BQ.1తో పోల్చితే ఈ వేరియంట్ 120 రెట్లు వేగంగా వ్యాపిచెందుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.