ల్యాండ్​ ఫర్ జాబ్స్ కేసులో.. లాలూ భార్య పేరు

ల్యాండ్​ ఫర్ జాబ్స్ కేసులో.. లాలూ భార్య పేరు

 న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ మంగళవారం తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు ముగ్గురితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు, రెండు సంస్థల పేర్లను చేర్చింది. లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ(68), కుమార్తెలు ఎంపీ మీసా భారతి(47), హేమా యాదవ్(40), లాలూ ఫ్యామిలీకి సన్నిహితుడు అమిత్ కత్యాల్(49), రైల్వే ఉద్యోగి హృదయానంద్ చౌదరి, ఏకే ఇన్ఫోసిస్టమ్స్, ఏబీ ఎక్స్‌‌‌‌పోర్ట్స్ కంపెనీలపై అభియోగాలు మోపింది. మొత్తం 7 పేర్లతో 4700 పేజీల చార్జిషీట్​ను.. ఢిల్లీలోని స్పెషల్ కోర్టులో ఈడీ సమర్పించింది.