జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షనలో ఇద్దరు ఖైదీలు చనిపోయారు. పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ డిస్టిక్ జైలులో శుక్రవారం రాత్రి ఖైదీలకు గొడవైంది. అది ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంతగా మారి.. రెండు వర్గాల మధ్య ఫైటింగ్ అయింది. ఈ ఘర్షనలో ఇద్దరు ఖైదీలు చనిపోయారని, కొంతమంది గాయపడినట్లు జైలు అధికారులు తెలిపారు. ఖైదీల వీపు, తల, చేతులు, చెవులపై పదునైన వస్తువులతో దాడి చేసుకున్నారని జైలు సూపరిండెంట్ అన్నారు. తీవ్రంగా గాయాలైన ఇద్దరిని పాటియాలా హాస్పిటల్ కు రిఫర్ చేశారు. హర్ష్, ధర్మేందర్ మృతి చెందగా, గగన్దీప్ సింగ్, మహ్మద్ సెహ్వాజ్లు గాయపడ్డారని డాక్టర్ తెలిపారు. గొడవకు ఎందుకు జరిగిందనే కారణాల కోసం అధికారులు దర్యాప్తు చేస్తు్న్నారు.