బాసరలో ఘోరం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

బాసరలో ఘోరం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. మృతులను నిజామాబాద్​ నగరానికి చెదిన మానస(27), ఆమె కుమారుడు బాలాదిత్య (8) కుమార్తె నవ్యశ్రీ (7) గా గుర్తించారు. గోదావరి హారతి ఘాట్ సమీపంలో పిల్లల స్కూల్ బ్యాగులు, టిఫిన్ బాక్సులను పోలీసులు గుర్తించారు. బాసర పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించి మృతదేహాల కోసం గాలిస్తున్నారు.