- కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి చెట్టిపల్లి శివాజీ వినతి
న్యూఢిల్లీ : ఆరె కులాన్ని ఓబీసీ జాబితా లో చేర్చాలని ఆరెపల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టిపల్లి శివాజీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఆరె కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చే అంశంపై మంత్రితో చర్చించారు. తమ సమస్యపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని శివాజీ తెలిపారు.
కులాల జాబితాపై ఓబీసీ కమిషన్ వద్ద ఉన్న రిపోర్ట్ను సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి తెలిపారని చెప్పారు. వెంటనే సోషల్ జస్టిస్ ప్రిన్సిపల్ సెక్రటరీతో అపాయింట్మెంట్ ఖరారు చేశారని వెల్లడించారు. అనంతరం రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యను కలిసి తమ సమస్య పరిష్కారం కోసం సహకరించాలని కోరినట్లు శివాజీ పేర్కొన్నారు.