వంశీరామ్ బిల్డర్స్పై 4వ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

వంశీరామ్ బిల్డర్స్పై  4వ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్: వంశీరామ్ బిల్డర్స్ పై  4వ రోజు ఇన్ కం టాక్స్ సోదాలు కొనసాగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ ఎండీ సుబ్బారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ సిబ్బంది.. తాాజాగా ప్రైవేటు వ్యక్తులతో చేసుకున్న ఒప్పందాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి లెక్కల్లో తేడాలున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

కంపెనీ ఉద్యోగుల ఖాతాల నుంచి కూడా ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆర్ధిక లావాదేవీల గురించి ఆరా తీస్తూ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.