బల్దియా ఉద్యోగులకు ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలె : ఊదరి గోపాల్ డిమాండ్

బల్దియా ఉద్యోగులకు ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలె : ఊదరి గోపాల్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సూరెన్స్ అమౌంట్​ను పెంచాలని జీహెచ్ఎంఈయూ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్) ప్రెసిడెంట్ ఊదరి గోపాల్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఉద్యోగులకు రూ. 3 లక్షల ఇన్సూరెన్స్ మాత్రమే కల్పిస్తున్నారని..  ఆస్పత్రి పాలైతే అవి సరిపోవడం లేదన్నారు.

దీంతో ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని.. కొందరు ఆస్పత్రి బిల్లుల కోసం అప్పులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు భద్రతా కార్డు తరహాలో బల్దియా ఉద్యోగులకు రూ.30 లక్షలు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆయన కోరారు.