పెరుగుతున్న చలికి అలర్జీ, శ్వాస సంబంధిత సమస్యలు

పెరుగుతున్న చలికి అలర్జీ, శ్వాస సంబంధిత సమస్యలు

డైలీ 1,500 నుంచి 2వేల వరకు ఓపీలు

హైదరాబాద్, వెలుగు: రోజురోజుకీ తీవ్రమవుతున్న చలి కారణంగా వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో కోఠిలోని ఈఎన్​టీ హాస్పిటల్​కు పేషెంట్ల రద్దీ పెరుగుతోంది. డైలీ ఓపీ కేసులు 1,500 నుంచి 2 వేల వరకు ఉంటున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఈఎన్​టీ హాస్పిటల్​కు సిటీ నుంచే కాకుండా నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా పేషెంట్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

దీంతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లోని ఔట్ పేషెంట్ బ్లాక్, ఇన్ పేషెంట్ బ్లాక్‌‌‌‌‌‌‌‌లు  నిండిపోయి కనిపిస్తున్నాయి. చిన్నారులకు అలర్జీ కారణంగా జలుబు వస్తుంటుందని ఈఎన్​టీ సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. సైనస్, ఆస్తమా ఉన్న వాళ్లు చలికాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.