IND vs AUS: టాస్ గెలిచిన ఆసీస్ సారథి.. భారత్ బ్యాటింగ్

IND vs AUS: టాస్ గెలిచిన ఆసీస్ సారథి.. భారత్ బ్యాటింగ్

విశాఖ సాగర తీరాన జరిగిన తొలి టీ20లో ఆసీస్‌ను మట్టికరిపించిన భారత యువ జట్టు.. రెండో టీ20లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది. తిరువనంతపురం వేదికగా రెండో టీ20లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుండగా, భారత జట్టు గెలిచిన జట్టునే కొనసాగించింది.    

తుది జట్లు

భారత జ‌ట్టు: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ. 

ఆస్ట్రేలియా జ‌ట్టు: మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్/కెప్టెన్‌), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడం జాంపా, తన్వీర్ సంగా.