IND vs IRE 1st T20I: తొలి ఓవర్‌లోనే విమర్శకుల నోరు మూయించిన బుమ్రా

IND vs IRE 1st T20I: తొలి ఓవర్‌లోనే విమర్శకుల నోరు మూయించిన బుమ్రా

ఏడాది తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా రేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా.. తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఐర్లాండ్‌తో జరుగుతోన్న తొలి టీ20లో మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి తన సత్తా ఏంటో చాటిచెప్పాడు. రెండో బంతికి ఆండ్రూ బల్బిర్నీని క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా..ఇదో బంతికి లోర్కాన్ టక్కర్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. 

దాదాపు ఏడాది తర్వాత బుమ్రా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా నిరుడు టీ20 ప్రపంచకప్‌తో పాటు ఎన్నో ప్రధాన మ్యాచ్‌లకు దూరమైన అతడు.. వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఐర్లాండ్‌‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో బరిలోకి దిగాడు.

బుమ్రాపై ఎన్నో విమర్శలు

గాయం కారణంగా జట్టుకు దూరమవ్వడం బుమ్రాను విమర్శల పాలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ సమయంలో బుమ్రాకు గాయాలు గుర్తుకురావని.. దేశానికి ఆడే సమయంలో మాత్రమే అలాంటి ఆటంకాలు వస్తాయని ప్రతిఒక్కరూ విమర్శించారు. వీటిపై ఇన్నాళ్లు నోరు మెదపని.. ఈ పేసర్ రీ ఎంట్రీలో తొలి మ్యాచ్‌తోనే వారి నోర్లు మూయించాడు.