బుమ్రా వచ్చేశాడు.. ఐర్లాండ్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

బుమ్రా వచ్చేశాడు.. ఐర్లాండ్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

ఐర్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు మొత్తం 15 మందితో కూడిన జ‌ట్టును ఎంపిక చేసింది. ఈ టీంకు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు.

గ‌త కొంత‌కాలంగా వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్న బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులో చేరడం అభిమానుల‌కు సంతోషాన్నిచ్చేదే. దీంతో అత‌డు స్వ‌దేశంలో జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడ‌తాడా! లేదా అనే సందేహాల‌కు తెర‌ప‌డింది. అయితే ఆగస్ట్ 30 నుంచి ఆసియా కప్ 2023 ప్రారంభం కానున్న నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఆటగాళ్లను ఈ టూర్‌కు ఎంపిక చేయ‌లేదు.

ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు

జ‌స్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), శివమ్ దూబే, వాషింగ్ట‌న్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.

ఇండియా vs  ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్

  • మొదటి టీ20: ఆగస్ట్ 18 (డబ్లిన్)
  • రెండో టీ20: ఆగస్ట్ 20 (డబ్లిన్)
  • మూడో టీ20: ఆగస్ట్ 23 (డబ్లిన్)