IND vs IRE: భారత్‌తో టీ20 సిరీస్.. ఐర్లాండ్ జట్టు ప్రకటన

IND vs IRE: భారత్‌తో టీ20 సిరీస్.. ఐర్లాండ్ జట్టు ప్రకటన

ఆగస్టు 18 నుంచి ఇండియా- ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత్‌తో తలపడేందుకు 15 మంది ఆటగాళ్లతో కూడిన పటిష్ట జట్టును ఐర్లాండ్ ప్రకటించింది. ఈ జట్టుకు ఐరిష్ సీనియర్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

ఐర్లాండ్ టీ20 జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బరిన్, మార్క్ అడైర్, రాస్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, థియో వాన్ వోర్కోమ్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.

ఇండియా vs ఐర్లాండ్ షెడ్యూల్

  • తొలి టీ20: 18 ఆగస్ట్ (ది విలేజ్, డబ్లిన్)
  • రెండో టీ20: 20 ఆగస్ట్ (ది విలేజ్, డబ్లిన్)
  • మూడో టీ20: 23 ఆగస్ట్ (ది విలేజ్, డబ్లిన్)