IND vs PAK: వారిపైనే అనుమానం!: 24 క్యారెట్ల గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న ఊర్వశి రౌటేలా

IND vs PAK: వారిపైనే అనుమానం!: 24 క్యారెట్ల గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న ఊర్వశి రౌటేలా

'ఊర్వశి రౌటేలా vs రిషబ్ పంత్..' వీరి పంచాయితీ గురుంచి చెప్పుకోవడం కంటే మౌనంగా ఉండడం మేలు. పంత్‌ తన కోసంహోటల్ లాబీలో చాలా సేపు ఎదురు చూశాడంటూ ఈ ముద్దుగుమ్మ బాంబ్ పేల్చటం.. దీనిపై పంత్ స్పందిస్తూ 'పాపులారిటీ కోసం ఇలా కొంత మంది ఇతరుల పేర్లని వాడుకుంటారని.." అతడు ఘాటుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వీరిద్దరి మధ్య శత్రుత్వానికి దారితీసింది. ఆ తర్వాత ఊర్వశి.. "చోటు భయ్యా.. వెళ్లి ఆడుకో.." అంటూ వ్యంగ్యంగా రిప్లై ఇవ్వడం.. అబ్బో కొన్నాళ్లక్రితం వీరిద్దరి మధ్య చాలానే జరిగింది.

పంత్ ప్రమాదానికి గురయ్యాక సైలెంట్ అయిపోయిన ఈ ఐటమ్ గర్ల్.. మళ్ళీ ఇన్నాళ్లకు అభిమానుల ముందుకొచ్చింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్‌కు హాజరైన రౌటేలా.. అభిమానులను తన అందంతో ఆకట్టుకుంది. బ్లూ టాప్‌లో తన అందచందాలు చూపిస్తూ అందరికీ కనువిందు చేసింది. కాకపోతే ఇలా చేయబోయి.. మరొక విధంగా నష్టపోయింది. తన 24 క్యారెట్ల గోల్డ్ ఐఫోన్ స్టేడియంలో ఎవరో కొట్టేశారట. కనపడితే ఇవ్వండంటూ సోషల్ మీడియాలో లబోదిబోమంటోంది.

ALSO READ : గుడ్ న్యూస్.. రైతు బంధు రూ. 16 వేలు

దయచేసి నా ఫోన్ ఇచ్చేయండి..!  

"అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నా 24 క్యారెట్ల నిజమైన బంగారు ఐ ఫోన్‌ పోయింది! ఎవరికైనా అది కనపడితే దయచేసి సహాయం చేయండి. వీలైనంత త్వరగా నన్ను సంప్రదించండి! .." అని ఊర్వశి అభిమానులకు విజ్ఞప్తి చేసింది. దీనిపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. ప్రతీకారం కోసం పంత్ అభిమానులు కొట్టేసి ఉంటారని ఛలోక్తులు విసిరితున్నారు. మరికొందరేమో.. పంత్ అభిమానులపై ఊర్వశికి అనుమానాలున్నాయన్న కామెంట్లు చేస్తున్నారు.