వెస్టిండీస్ బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ

వెస్టిండీస్ బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ

ఇండియాతో జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత యువ ఆటగాడు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ టీ20ల్లో ఆరంగ్రేటం చేశాడు. అలాగే రెండో టీ20కు దూరమైన చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

కాగా, తొలి రెండు టీ20ల్లో ఓటమిపాలైన భారత జట్టుకు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. గెలవకపోతే సిరీస్ విండీస్ వశం అవుతుంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో విండీస్ 2-0 ఆధిక్యంలో ఉంది.

తుది జట్లు:

ఇండియా: శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్.

వెస్టిండీస్: బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.