మెరిసిన కోటియన్, కాంబోజ్‌‌‌‌ .. ఇంగ్లండ్‌‌ లయన్స్‌‌తో రెండో మ్యాచ్ డ్రా

మెరిసిన కోటియన్, కాంబోజ్‌‌‌‌ .. ఇంగ్లండ్‌‌ లయన్స్‌‌తో రెండో మ్యాచ్ డ్రా

నార్తాంప్టన్‌‌‌‌:  ఇంగ్లండ్‌‌‌‌ లయన్స్‌‌‌‌తో రెండో అనధికార టెస్టు మ్యాచ్‌‌‌‌ను కూడా ఇండియా–ఎ డ్రాగా ముగించింది. ఇండియా ఇచ్చిన 439 టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో నాలుగో రోజు,  సోమవారం చివరకు లయన్స్ 11  ఓవర్లకు  32/3 స్కోరు మాత్రమే చేసింది. అంతకుముందు ఇండియా బౌలర్లు తనుష్ కోటియన్‌‌‌‌ (90 నాటౌట్‌‌‌‌), అన్షుల్ కాంబోజ్ (51 నాటౌట్‌‌‌‌) బ్యాట్‌‌‌‌తో మెరిశారు. ఈ ఇద్దరూ ఫిఫ్టీలతో మెప్పించడంతో ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 163/4తో  రం ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌ను 417/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆట మొదలైన కొద్దిసేపటికే ధ్రువ్‌‌‌‌ జురెల్ (28) ఔటైనా.. మరో ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి (42) రాణించాడు.

 శార్దూల్ ఠాకూర్ (34)తో ఆరో వికెట్‌‌‌‌కు 47 రన్స్‌‌‌‌ జోడించాడు. ఫిఫ్టీ చేసేలా కనిపించిన నితీష్‌‌‌‌తో పాటు శార్దూల్‌‌‌‌ను హిల్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేయడంతో 268/7తో నిలిచిన ఇండియా 300 స్కోరు చేస్తే గొప్పే అనిపించింది. ఈ దశలో కోటియన్‌‌‌‌, అన్షుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 149 రన్స్ జోడించారు.  కోటియన్ టాపార్డర్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ను తలపించే రీతిలో మంచి షాట్లతో ఆకట్టుకున్నాడు. 

ఈ క్రమంలో ఇద్దరూ ఫిఫ్టీలు పూర్తి చేసుకోగా.. కోటియన్ సెంచరీ వైపు కదిలాడు. అయితే, టీ బ్రేక్ తర్వాత కెప్టెన్ అభిమన్యు ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. మూడో సెషన్‌‌‌‌లో ఛేజింగ్‌‌‌‌కు వచ్చిన లయన్స్‌‌‌‌ వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ హెయిన్స్‌‌‌‌ (7)ను తుషార్ ఔట్ చేయగా.. ఎమిలిలో గె (5), జోర్డన్ కాక్స్ (0)ను కాంబోజ్‌‌‌‌ వెనక్కు పంపాడు. అయితే, ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరువురు కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.