
హైదరాబాద్, వెలుగు: తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూడాలని ఉప్పల్ స్టేడియానికి వచ్చిన క్రికెట్ఫ్యాన్స్ నిట్టనిలువు దోపిడీకి గురయ్యారు. ఎన్నో ఇబ్బందులు పడి టికెట్లు సంపాదించిన వాళ్లు స్టేడియంలో వాటర్, కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ రేట్లు చూసి షాకయ్యారు. పోలీసులు బయటి నుంచి వాటర్, తినుబండారాలను స్టేడియంలోకి అనుమతించలేదు. దాంతో స్టేడియంలో హెచ్సీఏ అనుమతితో వచ్చిన ఫుడ్ వెండర్లు భారీ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. 300 ఎంఎల్ నీళ్లను రూ. 20కి విక్రయించారు. అంటే లీటర్కు రూ. 70. వాటిని కూడా బాటిళ్లలో కాకుండా విడిగా ప్లాస్టిక్ గ్లాసుల్లో అమ్మారు. నిజానికి ప్రేక్షకులకు హెచ్సీఏనే ఉచితంగా తాగు నీరు అందించాలి. కూల్ డ్రింక్స్ (400 ఎంఎల్ రూ. 50), ఇతర ఫుడ్ ఐటమ్స్ను డబుల్, ట్రిపుల్ రేట్లకు అమ్మారు. ఇక స్టేడియంలోని బాత్రూమ్స్లో నీళ్లు రాక ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు.