
ఫింగర్ ఏరియాల్లో బలగాలు పెంచిన చైనా
డ్రాగన్కు దీటుగా మన బలగాల మోహరింపు
ఎయిర్ఫోర్స్ కూడా తయార్.. సుఖోయ్, మిగ్లతో రెక్కీలు
న్యూఢిల్లీ: కవ్వింపులను చైనా మరింత పెంచింది. బార్డర్ దాటుతూ, కాల్పులకు తెగబడుతూ ఆ నిందను మన మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్న డ్రాగన్ కంట్రీ.. వివాద ప్రాంతాల వద్ద బలగాల మోహరింపును పెంచుతోంది. చైనాకు అంతే దీటుగా మన ఆర్మీ కూడా సిద్ధమవుతోంది. బలగాలను పెంచుతోంది. రెండు దేశాల బలగాలు అతి కొద్ది దూరంలోనే ఉన్నాయి. సోమవారం నాటి ఘటన తర్వాత ఈస్టర్న్ లడఖ్లోని పాంగోంగ్ సో లేక్ ఉత్తర తీరంలో చైనా మోహరింపులను పెంచింది. మంగళవారం సాయంత్రం నుంచి అక్కడి ఫింగర్ ఏరియాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) యాక్టివిటీ పెరిగింది. ఇప్పటికే అక్కడ చైనా డిఫెన్స్ సెటప్లను ఏర్పాటు చేసిందని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. మన బలగాలు పీఎల్ఏ యాక్టివిటీపై ఓ కన్నేసి ఉంచాయని, రెండు దేశాల సైనికులు కొద్ది దూరంలో మాత్రమే ఉన్నారని అన్నారు. అయితే, ఫింగర్3, ఫింగర్4 రిడ్జ్లైన్స్ వద్ద చైనా ఆర్మీ ఉన్నా.. వాళ్లపై అణువణువునా నిఘా పెట్టేందుకు ఫింగర్ టాప్లను మన బలగాలు అధీనంలోకి తెచ్చుకున్నాయని చెబుతున్నారు.
పట్టు మన చేతుల్లోనే
మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, చైనా మంత్రి వాంగ్ యీ సమావేశం కాబోతున్న టైంలో.. చర్చల ద్వారా టెన్షన్ను తగ్గించేందుకు అవకాశం దొరికింది. చర్చల్లో మనదే పై చేయి కానుంది. అందుకు తగ్గట్టు పాంగోంగ్సో లేక్ దక్షిణ తీరం ఇప్పుడు మన పట్టులోనే ఉంది. పాంగోంగ్ లేక్ ఉత్తర తీరం ఫింగర్లుగా ఉంటుంది.అందులో ఫింగర్8 మనదే. అక్కడి నుంచి ఫింగర్ 4 వరకు మన ఆర్మీ అధీనంలో ఉంది. కానీ, అక్కడే స్టేటస్కోను మార్చేసే ప్రయత్నం చేస్తున్నది చైనా ఆర్మీ. ఫింగర్4 వద్ద ఇప్పటికే బలగాలను మోహరించిన పీఎల్ఏ.. ఫింగర్5, ఫింగర్8 మధ్యలోనూ నిర్మాణాలు చేపట్టింది. అక్కడి నుంచి దక్షిణ తీరాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలనుకున్న చైనా కుతంత్రాన్ని మన ఆర్మీ సాగనివ్వలే. ముందే అక్కడి కొండలను స్వాధీనం చేసుకుని షాకిచ్చింది. అందులో అత్యంత ముఖ్యమైన కొండ ప్రాంతం రెచిన్ లా. మన ఆర్మీ చేతుల్లోనే ఇప్పుడు ఆ ప్రాంతం ఉంది.
మన ఎయిర్ఫోర్స్ తయార్
పాంగోంగ్ సో లేక్ వద్ద ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మన ఎయిర్ఫోర్స్ కూడా సిద్ధమైంది. అక్కడి ఉత్తర తీరం వద్ద సార్టీస్ (రెక్కీ)ని పెంచింది. సుఖోయ్, మిగ్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లతో నిఘాను మరింత పటిష్టం చేసిందని అధికారులు చెబుతున్నారు. అన్ని బార్డర్ల వద్ద బలగాలను ఆర్మీ మరింత అలర్ట్ చేసిందని చెబుతున్నారు.
For More News..