
భువనేశ్వర్: కెప్టెన్ సునీల్ ఛెత్రి 87వ ఇంటర్నేషనల్ గోల్తో మెరిసిన వేళ ఇండియా ఫుట్బాల్ టీమ్ ఇంటర్ కాంటినెంటల్ కప్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆతిథ్య ఇండియా 2–0తో లెబనాన్పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఫస్టాఫ్లో ఒక్క గోల్ రాలేదు. బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే 46వ నిమిషంలో లలియాంజులా చాంగ్టే ఇచ్చిన క్రాస్ను అందుకున్న ఛెత్రి ఇండియాకు గోల్ అందించాడు. ఆపై 66వ నిమిషంలో చాంగ్టే చేసిన గోల్తో ఛెత్రిసేన ఘన విజయం సాధించింది. 2018లో ఆరంభ ఎడిషన్లో గెలిచిన ఇండియాకు ఇది రెండో కప్.