గువహటి: లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి చైనా కవ్వింపులు పెరుగుతుండటంతో బార్డర్లో కేంద్రం భద్రతను పెంచుతోంది. ఇందులో భాగంగా అస్సాంలో పినాకా, స్మెర్చ్మల్టీ రాకెట్ లాంచర్ సిస్టమ్స్ను ఆర్మీ రెడీగా ఉంచింది. పినాకా సిస్టమ్ను పూర్తిగా దేశీయంగా డీఆర్డీవో తయారు చేసిందని, ఇదో మల్టీ రాకెట్ లాంచింగ్ సిస్టమని అధికారులు చెప్పారు. ఒక బ్యాటరీలోని 6 లాంచర్లు 44 సెకన్లలో 72 రాకెట్లను ఫైర్ చేయగలవన్నారు. ఈ ఆటోమెటిక్ వెపన్ సిస్టమ్38 కిలోమీటర్ల పరిధిలో టార్గెట్లను ఈజీగా ఛేదించగలుగుతుందని వివరించారు. స్మెర్చ్ సిస్టమ్ దాదాపు 90 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదని.. ఒక బ్యాటరీలోని 4 లాంచర్లు 40 సెకన్లలో 48 రాకెట్లను ఫైర్ చేయగలవని తెలిపారు. హిందూ దేవుడు శివుని విల్లు ‘పినాకా’ పేరును ఆర్మీ రాకెట్లాంచింగ్ సిస్టమ్కు పెట్టారు.
ఇంకో మీటింగ్కు ఇండియా, చైనా నిర్ణయం
ఇండియా, చైనా మధ్య గల్వాన్లో జరిగిన వివాదంపై 13వ విడత సైనిక కమాండర్ల స్థాయి చర్చలు విఫలమయ్యాయి. దీంతో చైనా సరిహద్దులో ఆయుధాలను తరలిస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. సరిహద్దు వెంబడి 100 అత్యాధునిక లాంగ్ రేంజ్రాకెట్ లాంచర్లను చైనా తాజాగా మోహరించింది. కానీ చైనా మాత్రం తమ జవాన్లు చలి వాతావరణానికి అలవాటు పడాటానికే ఇదంతా చేస్తున్నామని చెబుతోంది. మరోవైపు మన ఆర్మీ ఇప్పటికే ఎం777 అల్ట్రాలైట్ హోవిట్జర్లను బార్డర్కు తరలించింది. కాగా, 13వ మీటింగ్ చర్చలు విఫలమవడంతో మరో మీటింగ్ పెట్టుకోవాలని రెండు దేశాలు నిర్ణయానికి వచ్చాయి. మీటింగ్ తేదీలు ఇంకా ఖరారు కాలేదు.