ఆసియా ఆర్చరీ బరిలో సురేఖ

ఆసియా ఆర్చరీ బరిలో సురేఖ

సోనిపట్ : తెలుగమ్మాయి, ఇండియా కాంపౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెన్న జ్యోతి సురేఖ నవంబర్ 3- నుంచి 10 వరకు బ్యాంకాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే ఆసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగనుంది. కాంటినెంటల్ ఒలింపిక్ క్వాలిఫయర్స్ అయిన ఈ టోర్నీ కోసం గురువారం ఇండియా రికర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంపౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్లను ప్రకటించారు. వెటరన్ ఆర్చర్ తరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్ రాయ్, అతని ఆర్మీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్ జాదవ్ కొత్తగా మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చోటు దక్కించుకున్నారు.  

ఐదు రోజుల ట్రయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెప్పించిన ఈ ఇద్దరూ  డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఒలింపియన్ అటాను దాస్, మృణాల్ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను వెనక్కునెట్టి టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చారు. రికర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ ఇద్దరితో పాటు ఏపీ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, తుషార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెల్కే కూడా ఉన్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రాచీ సింగ్ స్థానంలో తిషా పునియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చింది. జ్యోతి సురేఖ విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నడిపించనుంది.