
బార్సిలోనా: స్పానిష్ హాకీ ఫెడరేషన్ టోర్నీలో ఇండియా టీమ్ ఫైనల్కు చేరలేకపోయింది. శుక్రవారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్ను ఇండియా 1–1తో డ్రా చేసుకుంది. ఇంగ్లండ్ తరఫున సామ్ వార్డ్ (5వ ని.) గోల్ చేయగా, హర్మన్ప్రీత్ సింగ్ (29వ ని.) ఇండియా తరఫున గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇండియా ఆకట్టుకోలేకపోయింది. ఈ టోర్నీలో ఇండియా ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు డ్రాలు, ఒక ఓటమిని నమోదు చేసింది.