ఏషియన్ గేమ్స్లో.. భారత్కు మరో గోల్డ్ మెడల్

ఏషియన్ గేమ్స్లో.. భారత్కు మరో గోల్డ్ మెడల్

చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో భారత్ సత్తా చాటింది.  ఇప్పటికే మూడు గోల్స్ సాధించిన భారత్.. తాజాగా మరోటి తన ఖాతాలో వేసుకుంది.  మహిళల  25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ లో  భారత్ కు బంగారు పతకం లభించింది.  బుధవారం, సెప్టెంబర్ 27న జరిగిన ఈ కాంపిటీషన్ లో మను బాకర్, ఇషా సింగ్,  రిత్మ్ సాంగ్వాన్ 1759 పాయింట్లతో భారత్ కు గోల్డ్ సాధించారు.

Also Read : ఎన్నాళ్లో వేచిన స్వర్ణం... 41 ఏండ్ల తర్వాత ఇండియాకు గోల్డ్​ 

ఈ రోజు భారత్‌కు ఇది రెండో పతకం. అంతకుముందు, మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ  ఏషియన్ గేమ్స్ లో భారత్  16 పతకాలు గెలుచుకోగా అందులో  నాలుగు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.