న్యూఢిల్లీ: పవన్ హన్స్లో వాటాలను అమ్మడాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. స్ట్రాటజిక్ ఇన్వెస్టర్గా నిలిచిన స్టార్9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం డిస్క్వాలిఫై కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పెండింగ్ కేసులు ఉండడంతో ఈ కన్సార్టియం డిస్క్వాలిఫై అయ్యింది. పవర్ హన్స్లో ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా, ఓఎన్జీసీకి 49 శాతం వాటా ఉంది. హెలీకాప్టర్ల సర్వీస్లను అందించే ఈ కంపెనీని అమ్మేందుకు కిందటేడాది ఏప్రిల్లో ప్రభుత్వం బిడ్లు పిలిచింది.
స్ట్రాటజిక్ సేల్ ద్వారా రూ.211.14 కోట్లను సేకరించాలని ప్లాన్స్ వేసుకుంది. బిగ్ చార్టర్ ప్రైవేట్, మహారాజా ఏవియేషన్ ప్రైవేట్, ఆల్మస్ గ్లోబల్ ఆపర్చునిటీ ఫండ్ ఎస్పీసీల కన్సార్టియం స్టార్9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్ గెలుచుకుంది. కానీ, ఆల్మస్ గ్లోబల్ ఆపర్చునిటీ ఫండ్పై ఎన్సీఎల్టీలో కేసు పెండింగ్లో ఉండడంతో మే లో సేల్ ప్రాసెస్కు బ్రేక్లు పడ్డాయి. ఎన్సీఎల్టీ, ఎన్సీలాట్ ఆర్డర్లను పరిశీలించాక ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది.