
హైదరాబాద్, వెలుగు: లగ్జరీ ఇంటీరియర్ డిజైన్ స్టూడియో అయిన క్రిస్మ్, లగ్జరీ హోం అప్లయన్సెస్లలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న గ్లోబల్ బ్రాండ్ పాబ్లోకు భారతదేశం మాస్టర్ ఫ్రాంచైజీ గా ఎంపికైనట్లు ప్రకటించింది. ఈ స్టోర్లో పాబ్లో సోఫాలు, బెడ్లు, టేబుల్లు, కుర్చీలు, సెట్టీలు వంటి ఫర్నిచర్ లభిస్తుంది. స్టోర్ను 20 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు.
మాడ్యులర్ కిచెన్లు, డిజైనర్ వార్డ్రోబ్లు, బెడ్లు, సోఫాలు, అవుట్డోర్ సెట్టీలు, స్టోరేజ్ క్యాబినెట్లు, డ్రస్సర్లు, ఫర్నిషింగ్లు, కార్పెట్లు, ఆర్ట్ఫ్యాక్ట్ లు, లైటెనింగ్ సొల్యూషన్స్కూడా అందుబాటులో ఉంటాయి. ఈ విభాగం విలాసవంతమైన విల్లాలు, విశాలమైన ఇండ్లు, కుటుంబ విశ్రాంతి గదులు, స్టూడియో అపార్ట్మెంట్లు, పిల్లల గదులు, అధునాతన వంటశాలలు, బహిరంగ ప్రదేశాల అవసరాలను తీరుస్తుందని క్రిస్మ్ ఫౌండర్ కిరణ్ కుమార్ చెప్పారు.