భారతదేశంలో పాబ్లో స్టోర్​ ప్రారంభం

భారతదేశంలో పాబ్లో స్టోర్​ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: లగ్జరీ ఇంటీరియర్ డిజైన్ స్టూడియో అయిన క్రిస్మ్, లగ్జరీ హోం అప్లయన్సెస్​లలో 40 సంవత్సరాల అనుభవం ఉన్న  గ్లోబల్ బ్రాండ్  పాబ్లోకు భారతదేశం మాస్టర్ ఫ్రాంచైజీ గా ఎంపికైనట్లు ప్రకటించింది. ఈ స్టోర్లో పాబ్లో సోఫాలు, బెడ్‌‌లు, టేబుల్‌‌లు, కుర్చీలు, సెట్టీలు వంటి ఫర్నిచర్​ లభిస్తుంది.  స్టోర్​ను 20 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు.

మాడ్యులర్ కిచెన్‌‌లు, డిజైనర్ వార్డ్‌‌రోబ్‌‌లు, బెడ్‌‌లు, సోఫాలు, అవుట్‌‌డోర్ సెట్టీలు, స్టోరేజ్ క్యాబినెట్‌‌లు,  డ్రస్సర్‌‌లు,  ఫర్నిషింగ్‌‌లు, కార్పెట్లు,  ఆర్ట్‌‌ఫ్యాక్ట్ లు, లైటెనింగ్ సొల్యూషన్స్​కూడా అందుబాటులో ఉంటాయి. ఈ విభాగం విలాసవంతమైన విల్లాలు, విశాలమైన ఇండ్లు, కుటుంబ విశ్రాంతి గదులు, స్టూడియో అపార్ట్‌‌మెంట్‌‌లు, పిల్లల గదులు, అధునాతన వంటశాలలు,  బహిరంగ ప్రదేశాల అవసరాలను తీరుస్తుందని క్రిస్మ్  ఫౌండర్​ కిరణ్ కుమార్ చెప్పారు.