న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు శనివారం షెడ్యూల్విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈసారి ఎన్నికలను ఎకోఫ్రెండ్లీగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ఇండియా (ఈసీఐ) నిర్ణయించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. అలాగే, పేపర్ వాడకాన్ని తగ్గించడంతోపాటు సిబ్బందిని తరలించేందుకు ఎకోఫ్రెండ్లీ వాహనాలనే వాడాలని, కార్పూలింగ్ (ఒకే వాహనంలో ఎక్కువ మంది ప్రయాణం) పాటించాలని ఎన్నికల యంత్రాంగానికి, రాజకీయ పార్టీలకు మార్గదర్శకాలు జారీచేసింది.
పర్యావరణ అనుకూలంగా ఎన్నికలు నిర్వహించేలా ఈసీఐ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో వ్యర్థాల నిర్వహణపై పక్కా మార్గదర్శకాలు జారీచేసినట్టు చెప్పారు. ఓటర్ లిస్ట్, ఎన్నికల సమాచార ముద్రణకు పేపర్ వాడకాన్ని తగ్గించేందుకు డబుల్సైడ్ ప్రింటింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు తెలిపారు.
కార్బన్ ఫుట్ప్రింట్ను తగ్గించేందుకు తక్కువ సంఖ్యలో వాహనాలు వాడాలని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగించుకోవాలని, ప్రచార కార్యక్రమాలకోసం పునరుత్పాదక శక్తివనరులను వినియోగించుకోవాలని, దూరం తగ్గించేందుకు పోలింగ్ కేంద్రాలను ఏకీకృతం చేయాలని ఎన్నికల యంత్రాంగంతోపాటు రాజకీయ పార్టీలను కోరారు. ఏప్రిల్ 19న 543 లోక్సభ స్థానాలకు 7 దశల్లో పోలింగ్ ప్రారంభం కానున్నది. తొలి దశలో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి.