–ఇస్లామాబాద్: పాకిస్తాన్తో డేవిస్ కప్ పోరులో ఇండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్స్లో భాగంగా శనివారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్లను గెలిచిన ఇండియా 2–0 లీడ్లో నిలిచింది.
తొలి మ్యాచ్లో రామ్కుమార్ రామనాథన్ 6–7 (3), 7–6(4), 6–0తో ఐజమ్ ఉల్ హక్ ఖురేషికి చెక్ పెట్టాడు. రెండు గంటల ఒక నిమిషం పాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్ సర్వీస్లతో పాటు బలమైన రిటర్న్స్తో ఆకట్టుకున్నాడు. వరుసగా 9 గేమ్లను కాచుకున్నాడు.
తొలి సెట్ చేజారినా.. తర్వాతి రెండు సెట్లలో ఐజమ్ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. రెండో సింగిల్స్లో ఎన్. శ్రీరామ్ బాలాజీ 7–5, 6–3తో అఖీల్ ఖాన్పై నెగ్గాడు. గంటా 15 నిమిషాల మ్యాచ్లో బాలాజీ పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. ఆదివారం డబుల్స్తో పాటు రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్లు జరుగుతాయి.