
జోహర్ బారు (మలేసియా): సుల్తాన్ జోహర్ కప్ జూనియర్ హాకీ టోర్నీలో ఇండియాకు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఇండియా 3–6తో జర్మనీ చేతిలో ఓడింది. అమన్దీప్ లక్రా (35వ ని.), ఉత్తమ్ సింగ్ (58వ ని.), రోహిత్ (60వ ని.) ఇండియాకు గోల్స్ అందించగా, జర్మనీ తరఫున క్రిస్టియన్ ఫ్రాంజ్ (16వ ని.), నికాస్ బెరెండెట్స్ (29, 45వ ని.), పీర్ హెన్రిచ్స్ (43, 48వ ని.) స్పెర్లింగ్ ఫ్లోరియన్ (49వ ని.) గోల్స్ చేశారు. ఆరంభంలో ఎటాకింగ్ గేమ్ ఆడిన ఇండియా తొలి నిమిషంలోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీన్ని ఆసరాగా చేసుకున్న జర్మనీ కౌంటర్ ఎటాక్తో అనుకున్న ఫలితాన్ని సాధించింది. శనివారం జరిగే థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్ మ్యాచ్లో ఇండియా.. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లో ఓడిన జట్టుతో తలపడుతుంది.