IND vs ENG 1st Test: జడేజా, అయ్యర్ ఔట్.. ఓటమి దిశగా టీమిండియా

IND vs ENG 1st Test: జడేజా, అయ్యర్ ఔట్.. ఓటమి దిశగా టీమిండియా

ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 119 పరుగులకే 7 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టీ విరామానికి 3 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసిన రోహిత్ సేన.. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్ లో అశ్విన్ (0), భరత్ (0) ఉన్నారు. టీమిండియా గెలవాలంటే మరో 112 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి.

టీ విరామం తర్వాత 17 పరుగులు చేసిన అక్షర్ పటేల్ టామ్ హార్టిలికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 22 పరుగులు చేసిన రాహుల్ రూట్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. కాసేపటికే జడేజా రనౌట్ అవ్వడంతో మ్యాచ్  ఇంగ్లాండ్ వైపుకు మళ్లింది. అయ్యర్ క్రీజ్ లో ఉన్నాడనుకున్నా లీచ్ బౌలింగ్ లో స్లిప్ లో రూట్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇప్పుడు భారత్ ను ఆదుకునే వంతు అశ్విన్, భరత్ మీద పడింది.