
ఆమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ యూరోపియన్ లెగ్లో ఇండియా మెన్స్ హాకీ టీమ్ మరోసారి నిరాశపరిచింది. ఒలింపిక్ చాంపియన్ నెదర్లాండ్స్ చేతిలో రెండోసారి ఓడింది. ఆఖరి నిమిషాల్లో గోల్ సమర్పించుకునే బలహీనతను మరోసారి చూపెట్టిన ఇండియా సోమవారం జరిగిన2–-3 తేడాతో పరాజయం పాలైంది.
ఇండియా తరఫున తన 100వ మ్యాచ్ ఆడుతున్న అభిషేక్ (20వ నిమిషంలో) గోల్ చేయగా, జుగ్రాజ్ (54వ ని) పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచాడు. నెదర్లాండ్స్ తరఫున థిజ్స్ (24వ ని), హోడెమేకర్స్ (33వ ని), జిప్ జాన్సెన్ (57వ ని) గోల్స్ చేశారు. ఇండియా తొమ్మిది పెనాల్టీ కార్నర్లలో ఒక్కదాన్నే గోల్గా మలిచింది. బుధవారం జరిగే మ్యాచ్లో
అర్జెంటీనాతో తలపడనుంది.