
న్యూఢిల్లీ: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన ఇండియా మెన్స్ హాకీ టీమ్ తన ర్యాంక్ను కూడా మెరుగు పరుచుకుంది. ఎఫ్ఐహెచ్ తాజా ర్యాంకింగ్స్లో ఇండియా 2771.35 పాయింట్లతో నాలుగు నుంచి మూడో ర్యాంక్కు చేరుకుంది. ఇంగ్లండ్ (2763.50) నాలుగో ప్లేస్కు నెట్టింది. ప్రస్తుతం నెదర్లాండ్స్ (3095.90), బెల్జియం (2917.87) టాప్2 ర్యాంక్ల్లో కొనసాగుతున్నాయి. కాగా, ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్స్లో ఇండియా మూడో ప్లేస్కు రావడం ఇది రెండోసారి. 2021 ఒలింపిక్స్లో బ్రాంజ్ నెగ్గి ఫస్ట్ టైమ్ ఈ ర్యాంక్ సాధించింది