త్రీవ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో శ్రీలంకకు భారత ప్రభుత్వం మరోసారి ఆపన్న హస్తం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం ఆ దేశానికి 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఆఫర్ చేసినట్లు కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ వెల్లడించింది. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రి బసిల్ రాజపక్స మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం వెలువడినట్లు పేర్కొంది. కాగా, ఇప్పటికే భారత్ ఈ నెల మొదట్లో శ్రీలంకకు 900 మిలియన్ డాలర్ల ఫారెక్స్ సపోర్ట్ ను అందించిందని హైకమిషన్ తెలిపింది.
India offers credit line of USD 500 mn to Sri Lanka for purchase of petroleum products. Critical support by India follows discussion b/w EAM Jaishankar-SL Finance Min Basil Rajapaksa. India extended forex support of USD 900 mn earlier this month: High Commission of India,Colombo
— ANI (@ANI) January 18, 2022