రీషెడ్యూల్ .. అనుకున్న టైమ్ కంటే.. ఒక్కరోజు ముందే ఇండియా, పాక్ మ్యాచ్

రీషెడ్యూల్ .. అనుకున్న టైమ్ కంటే..  ఒక్కరోజు ముందే ఇండియా, పాక్ మ్యాచ్

వరల్డ్ కప్ 2023లో క్రికెట్ అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇండియా, పాకిస్థాన్  మ్యాచ్ అనుకున్నదానికంటే ఒక రోజు ముందుగా 2023 అక్టోబర్ 14కి రీషెడ్యూల్ చేయబడింది. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది.  వాస్తవానికి ఇరు జట్ల మధ్య  2023 అక్టోబర్ 15న మ్యాచ్ జరగాల్సి ఉంది. 

అయితే ఆ రోజున నవరాత్రి ప్రారంభం కానుండటంతో తగిన భద్రతను విషయంలో ఒక్క రోజు ముందుకు మార్చినట్లుగా తెలుస్తోంది.  ఈ  మ్యాచ్  అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.  ఇండియా తమ తొలి ప్రపంచకప్ మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో ఆడుతుండగా, పాకిస్థాన్ తొలి రెండు మ్యాచ్‌లు అక్టోబర్ 6 , అక్టోబర్ 12న హైదరాబాద్‌లో ఆడనున్నాయి.  

వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, పూణె, బెంగళూరు, లక్నో, చెన్నై, కోల్‌కతాతో సహా 10 వేదికలలో జరుగనుంది.