
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్లో హాకీలో ఇండియా , పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్లో బరిలోకి దిగనున్నాయి. ఈ పోటీల షెడ్యూ ల్ మంగళవారం రిలీజైంది. మొత్తం 12 జట్లు రెండు గ్రూప్ల్లో పోటీ పడనున్నాయి. గ్రూప్–ఎలో ఇండియా, పాక్తోపాటు, జపాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి. గ్రూప్–బిలో కొరియా, మలేసియా, చైనా, ఒమన్, థాయ్లాండ్, ఇండోనేసియా బరిలో నిలిచాయి. సెప్టెంబర్ 24న జరిగే తొలి మ్యాచ్లో ఇండియా ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. 26న సింగపూర్తో, 28న జపాన్తో, 30న పాక్తో, అక్టోబర్ 2న బంగ్లాదేశ్తో పోటీ పడనుంది.