మళ్లీ పంజా విసురుతున్న కరోనా

మళ్లీ పంజా విసురుతున్న కరోనా

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 7,240 కొత్త  కేసులు నమోదయ్యాయి. బధవారంతో పోలిస్తే ఇది 40శాతం ఎక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 4,31,97,522 కు చేరగా..4,26,40,301మంది కోలుకున్నారు రోజువారి కేసులు పెరగడంతో యాక్టివ్ కేసులు కూడా క్రమంగా అధికమవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 32,498 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపిన ఆరోగ్యశాఖ గత 24గంటల్లో 3591 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. 

మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రంలో 2701 కేసులు, కేరళ 2271, ఢిల్లీలో 564 కేసులు ఉన్నాయి. కాగా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పాజిటివిటీ రేటు కూడా 1.62కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,94 ,59,81,691 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని చెప్పింది.