న్యూఢిల్లీ : ఇండియా సీనియర్ షట్లర్ ఆర్ఎంవీ గురుసాయిదత్.. ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్కు గుడ్బై చెప్పాడు. గత కొన్నేళ్లుగా గాయాలతో బాధపడుతున్న అతను 15 ఏళ్ల కెరీర్కు సోమవారం ఫుల్స్టాప్ పెట్టాడు. 32 ఏళ్ల గురుసాయి.. 2014 గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో బ్రాంజ్ సాధించాడు. తన శరీరం సహకరించకపోవడం వల్లే ఆటకు గుడ్బై చెప్పినట్టు తను తెలిపాడు. 2008 కామన్వెల్త్ యూత్ గేమ్స్లో గోల్డ్, వరల్డ్ జూనియర్లో బ్రాంజ్ సాధించిన గురు ఇకపై కోచింగ్పై దృష్టిపెడతానని చెప్పాడు.