
ఒమన్ తో జరుగుతున్న ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేసింది. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ (56) హాఫ్ సెంచరీకి తోడు అభిషేక్ శర్మ (38), తిలక్ వర్మ (29) మెరుపులు మెరిపించడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులకు చేసింది. 56 పరుగులు చేసిన సంజు శాంసన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఒమన్ బౌలర్లలో అమీర్ కలీం, షా ఫైసల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఇండియాకు అనుకున్నంత గొప్ప ఆరంభం ఏమీ రాలేదు. రెండో ఓవర్లోనే గిల్ 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్లీన్ బౌల్డయ్యాడు. రెండో ఓవర్లో ఫైజల్ మేడిన్ ఓవర్ వేయడంతో తొలి రెండు ఓవర్లలో ఇండియా కేవలం ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడో ఓవర్ నుంచి ఇండియా స్కోర్ వేగంగా ముందుకెళ్లింది. ఓపెనర్ అభిషేక్ శర్మ తనదియాన్ మార్క్ షాట్లతో అలరించాడు. మరో ఎండ్ లో శాంసన్ కూడా వేగంగా ఆడడంతో ఇండియా పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది.
15 బంతుల్లోనే 38 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన అభిషేక్ శర్మ దూకుడుగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 8 ఓవర్ మూడో బంతికి ఒమన్ పేసర్ జితెన్ రామనందిని వేసిన బంతిని శాంసన్ స్ట్రయిట్ షాట్ ఆడాడు. బౌండరీ ఆపే క్రమంలో నేరుగా వస్తున్న బంతి జితెన్ చేతికి తగిలి వికెట్లను తాకింది. బాల్ స్టంప్స్ కు తగిలే సమయంలో హార్దిక్ నాన్ స్ట్రైకింగ్ లో క్రీజ్ లో బ్యాట్ పెట్టలేదు. దీంతో కేవలం ఒక పరుగుకే పాండ్య ఔటయ్యాడు.
ఈ దశలో సూర్య, అక్షర్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. నాలుగో వికెట్ కు 45 పరుగులు జోడించిన తర్వాత 13 బంతుల్లోనే 26 పరుగులు చేసిన అక్షర్ ఔటయ్యాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన శివమ్ దూబే 5 పరుగులే చేసి నిరాశపరిచాడు. శాంసన్, తిలక్ వర్మ కలిసి కాసేపు మెరుపులు మెరిపించి జట్టుకు భారీ స్కోర్ అందించిన తర్వాత పెవిలియన్ కు చేరారు. ఆఫ్గనిస్తాన్ బౌలర్లు విజృంభించడంతో చివరి మూడు ఓవర్లలో ఇండియా కేవలం 19 పరుగులు మాత్రమే చేయగలిగింది.