టీమ్లోకి బుమ్రా..టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన

 టీమ్లోకి బుమ్రా..టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన

టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనున్న ఈ టోర్నీకి 15 మందిని సెలక్ట్ చేసింది. గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. మోకాలి చికిత్స కారణంగా ఆల్ రౌండర్ జడేజా ఈ టోర్నీకి దూరమవ్వగా.. అతడి స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చాడు. 

టీమిండియా సభ్యులు వీరే : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్ 

స్టాండ్ బై ప్లేయర్లు :  షమీ, శ్రేయస్ అయ్యర్, దీపర్ చాహర్, రవి బిష్ణోయ్ లను బీసీసీఐ ఎంపిక చేసింది.

ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా సిరీస్ లకు దాదాపుగా ఇదే జట్టు ఆడనుంది. ఆసీస్ సిరీస్కు హర్షదీప్ సింగ్ దూరమవ్వగా.. సౌతాఫ్రికా సిరీస్కు హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ దూరమయ్యారు. ఈ సమయంలో వీరు కండీషనింగ్ కోసం ఎన్సీఏలో శిక్షణ తీసుకుంటారని బీసీసీఐ తెలిపింది.

ఆసియా కప్ 2022లో వైఫల్యం అనంతరం టీమ్ ఇండియాపై విమర్శలు వచ్చాయి. అదే జట్టుతో టీ20 ప్రపంచ కప్‌కు వెళితే మరోసారి పరాజయం తప్పదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలోనే ఈసారి ఇండియా టీమ్ లో కొన్ని మార్పులు జరిగాయి.