ఒడెన్స్ (డెన్మార్క్) : ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సింధు 21–-19, 21–-12తో వరల్డ్ నం. 19 సుపానిడా కాటెథాంగ్పై సునాయాసమైన విజయం సాధించి టైటిల్కు చేరువైంది. ఈ పోరులో సింధు బెస్ట్ ఆటతో ఆకట్టుకుంది.
రెండు గేమ్స్లోనూ తన స్కిల్స్ చూపెట్టిన ఇండియా స్టార్ నెట్ వద్ద అద్భుతంగా ఆడింది. 47 నిమిషాల్లోనే కాటెథాంగ్ పని పట్టి వరుసగా రెండో టోర్నీలోనూ సెమీస్ చేరింది. శనివారం జరిగే సెమీఫైనల్లో సింధు స్పెయిన్ స్టార్ షట్లర్, మూడుసార్లు వరల్డ్ చాంపియన్ కరోలినా మారిన్తో పోటీ పడనుంది.