క్రైసిస్‌లో శ్రీలంక.. 40 వేల టన్నుల డీజిల్ పంపిన ఇండియా

క్రైసిస్‌లో శ్రీలంక.. 40 వేల టన్నుల డీజిల్ పంపిన ఇండియా

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ఆర్థిక సంక్షోభం కారణంగా కనీసం ఆయిల్ నిల్వలు కొనుగోలు చేయలేక కరెంట్ ఉత్పత్తి విషయంలో చేతులెత్తేసిన ఆ దేశానికి ఇండియా అండగా నిలుస్తోంది. ఇవాళ శ్రీలంక రాజధాని కొలంబోలో మన దేశానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ అనుబంధ సంస్థ ఏకంగా 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను అందజేసింది. ఈ ఆయిల్‌ను సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు తీసుకుని కరెంట్ ఉత్పత్తికి వాడనుంది. ఆ దేశంలో సంక్షోభం నెలకొనడంతో కొద్ది రోజులుగా దాదాపు 10 నుంచి 13 గంటల పాటు కరెంట్ కోత విధిస్తోంది. ఈ పరిస్థితుల్లో పొరుగు దేశం కష్టం తీర్చేందుకు భారత్ ముందుకొచ్చింది.

ఇవాళ శ్రీలంకకు అందించిన 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను ఆ దేశ ఇంధన శాఖ మంత్రి జెమిని లొకుగెకు కొలంబోలోని భారత హైకమిషనర్ అందించారు. సుమారు రూ.3,800 కోట్ల విలువ చేసే ఈ డీజిల్‌ను లైన్ ఆఫ్ క్రెడిట్ కింద సాయంగా భారత్ అందించింది. ఈ విషయాన్ని శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం అఫీషియల్ ట్విట్టర్‌‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇలా ఆ దేశానికి ఇండియా లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా అందించడం ఇది నాలుగోసారి అని, దీనితో కలిపి గత 50 రోజుల్లో మొత్తం 2 లక్షల టన్నుల ఆయిల్‌ను సప్లై చేశామని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఆన్‌లైన్‌లో టెర్రరిజంపై ప్రచారం.. హైదరాబాదీ అరెస్ట్

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‎కు రిఫరీగా తెలుగు మహిళ

వీడియో: బిజీ రోడ్డులో కారుపై ఎక్కి డాన్సులు