ఈ నెల 18 నుంచి భారత్–న్యూజిలాండ్ టీ20 సిరీస్

ఈ నెల 18 నుంచి భారత్–న్యూజిలాండ్ టీ20 సిరీస్

ఈ నెల 18 నుంచి భారత్–న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత జట్టు న్యూజిలాండ్ చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ నెల 30 వరకు టీ20 సిరీస్ జరగనుంది. శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు లేకుండానే భారత జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. భారత జట్టుకు ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ లో తమ జట్టు ప్రదర్శన నిరాశపర్చినా..తప్పులను సరిచేసుకుంటూ ముందుకు సాగుతామని హార్థిక్ పాండ్యా వెల్లడించాడు.