
న్యూఢిల్లీ : ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారైందని, ఇండియా, పాక్ మ్యాచ్లకు శ్రీలంకలోని దంబుల్లా ఆతిథ్యమిస్తుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ బుధవారం మరోసారి స్పష్టం చేశాడు. షెడ్యూల్కు సంబంధించి పీసీబీ కొత్త చైర్మన్ జకా అష్రాఫ్.. బీసీసీఐ సెక్రటరీ జై షాతో చర్చలు జరిపారని గురువారం షెడ్యూల్ను ఫైనలైజ్ చేస్తారన్నాడు. ‘గతంలో అనుకున్నట్లుగానే శ్రీలంకలో హైబ్రిడ్ మోడల్లో ఆసియా కప్ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయి.
నాలుగు లీగ్ గేమ్స్ పాక్లో, మిగతా మ్యాచ్లు లంకలో జరుగుతాయి. ఇండియా, పాక్ ఆడే మ్యాచ్లకు దంబుల్లా ఆతిథ్యమిస్తుంది’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కోసం డర్బన్ వెళ్లిన ధుమాల్ పేర్కొన్నాడు.