
వెస్టిండీస్ తో జరుగుతోన్న తొలి టెస్టులో మొదటి రోజు భారత్ అదరగొట్టింది. భారత స్పిన్నర్లు ,అశ్విన్, జడేజల దాటికి విండీస్ ను 150 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం చేజింగ్ కు దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైశ్వాల్ 40, రోహిత్ శర్మ 30 నాటౌట్ గా ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన విండీస్ ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. ఒపెనర్ బ్రాత్ వైట్ 20 పరుగులకు, మరో ఓపెనర్ చంద్రపాల్ ను 12 పరుగులకే అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. విండీస్ బ్యాట్స్ మెన్ లలో అలిక్ అథనేజ్ 47 పరుగులు మినహా మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లు అశ్విన్ 5, జడేజా 3 , శార్దూల్ థాకూర్ 1, సిరాజ్ లు ఒక వికెట్ తీయడంతో విండీస్ 64.3 ఓవర్లకే ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులు మాత్రమే చేయగల్గింది.
అనంతరం చేజింగ్ కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ అదరగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్లలో 80 పరుగులు చేసింది. ఇంకా 70 పరుగుల వెనుకంజలో ఉంది. రోహిత్ శర్మ 30, జైశ్వాల్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.