స్క్వాష్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో ఇండియా బోణీ

స్క్వాష్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో ఇండియా బోణీ

చెన్నై: సొంతగడ్డపై స్క్వాష్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ను ఇండియా ఘన విజయంతో ప్రారంభించింది. చెన్నైలో మంగళవారం జరిగిన గ్రూప్‌‌–బి మ్యాచ్‌‌లో రెండో సీడ్‌‌ ఇండియా 4–0తో హాంకాంగ్‌‌ను చిత్తు చేసింది. మెన్స్‌‌ సింగిల్స్‌‌లో అభయ్‌‌ సింగ్‌‌, సౌరవ్‌‌ ఘోశాల్‌‌, విమెన్స్‌‌లో జోష్న చిన్నప్ప, తన్వీ ఖన్నా తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించారు. మరో మ్యాచ్‌‌లో టాప్‌‌ సీడ్‌‌ ఈజిప్ట్‌‌ 4–0తో  ఐదో సీడ్‌‌ ఆస్ట్రేలియాను ఓడించింది.