టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్లో భాగంగా మెల్బోర్న్లో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇండియా.. న్యూజిలాండ్పై 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్లో ఇండియన్ టీంకు ఇది మూడో మ్యాచ్. ఆడిన మూడు మ్యాచులలోనూ ఇండియా విజయం సాధించి, హ్యాట్రిక్ను నమోదు చేసింది. ఈ మ్యాచుకు ముందు ఇండియా.. బంగ్లాదేశ్ మరియు ఆసీస్లను ఓడించింది. వరుసగా మూడు మ్యాచులలో గెలిచి ఇండియా సెమీస్కు చేరింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకొని భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. భారత టీం 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య చేధనలో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. భారత ప్లేయర్ షెఫాలి వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
For More News..